విజయదశమి లేదా దసరా పండుగను అశ్విని మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. అలాగే దుర్గాదేవి దసరా రోజున మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. దీనికి గుర్తుగా కూడా విజయదశమిని జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండుగను ఏ రోజున జరుపుకోవాలనే దానిపై గందరగోళం ఏర్పడింది. కొన్ని చోట్ల ఈ పండుగను అక్టోబర్ 23న జరుపుకుంటే మరికొన్ని చోట్ల అక్టోబర్ 24న అంటే మంగళవారం నాడు జరుపుకుంటున్నారు.