బిస్రాఖ్, ఉత్తర ప్రదేశ్
ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న బిస్రాఖ్ గ్రామంలో రావణుడు జన్మించాడని గట్టి నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. అందుకే దసరా రోజు అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి, తల్లి కైకేశి. రావణుని తండ్రి విశ్రవుడు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని కూడా నమ్ముతారు. దీనికి గౌరవార్థం ఈ ప్రదేశానికి బిస్రాఖ్ అని పేరు పెట్టారు. ఇక్కడి వారు రావణుడిని మహా బ్రాహ్మణుడిగా భావిస్తారు.