సనాతన ధర్మంలో జ్యోతిషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జాతకాన్ని బట్టి ఒక వ్యక్తిని జ్యోతిష్యం అంచనా వేస్తుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యంతో సహా అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. జాతకంలో శుభ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. భవిష్యత్తులో ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే శుభ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.