భర్తని కాదని.. ‘పరాయి’ మోజు... ఆ వయసులోనే ఎక్కువ

First Published Nov 4, 2019, 2:39 PM IST

భర్తని కాదని వేరే వ్యక్తి మోజులో పడిపోవడం... అవసరం అనుకుంటున్న అడ్డుగా ఉన్న భర్తను చంపేయడం... ఇంకొందరు కడుపున పుట్టిన బిడ్డలను కూడా అడ్డుతొలగించుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. 

కాలం మారింది. పరిస్థితులూ మారాయి. పటి ష్టమైన భారతీయ వివాహ వ్యవస్థ కూడా ప్రస్తుతం ఆటుపోట్లకు లోనవుతోంది. పెళ్లి విషయంలో ఒకప్పు డు ప్రపంచమే మనల్ని చూసుకుని అనుసరించా లనుకుంటే ఇప్పుడు మనమే ఆ ప్రపంచం వైపు అడు గులు వేస్తున్నాం.
undefined
బిడ్డలకు పెళ్లి చేసి ఓ ఇంటివారిని చేస్తే తమ బాధ్యత తీరుతుందని ఒకప్పుడు తల్లిదండ్రులు భావించేవారు. ఇప్పుడు పెళ్లిచేశాక ఎటువంటి పరిస్థి తులు ఎదుర్కోవాల్సి వస్తోందో అని మధన పడుతు న్నారు. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తు న్న ఈ తరం దంపతుల పోకడ ఆ తరం వారి ఆందో ళనకు కారణమవుతోంది.
undefined
పెళ్లయిన నెలరోజులకే ‘ఇక నీతో వేగడం నా వల్ల కాదు’ అని ఒకరినొకరు ఈసడించుకుంటున్న జంటలు ఎన్నో. తమ పెద్దరికంతో దంపతుల మధ్య సఖ్యత కుదిర్చి కాపురం నిలబెట్టాల్సిన కొందరు తల్లిదండ్రులు కూడా ‘కలిసి బతకలేనప్పుడు విడిపోయి హాయిగా ఉండడమే మేలు’ అని వంతపాడుతుండడం సమస్యకు మరింత కారణమవుతోంది. కేవలం చిన్న చిన్న కారణాలనే బూతద్దంలో పెట్టి పెద్దదిగా చూసి.. కాపురాలను కూల్చుకుంటున్నారు.
undefined
ఇంకొందరు...భర్తని కాదని వేరే వ్యక్తి మోజులో పడిపోవడం... అవసరం అనుకుంటున్న అడ్డుగా ఉన్న భర్తను చంపేయడం... ఇంకొందరు కడుపున పుట్టిన బిడ్డలను కూడా అడ్డుతొలగించుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు.
undefined
అన్ని సంవత్సరాలపాటు ఆనందంగా ఉన్న జంట మధ్యలోని మరొకరిని ఎందుకు రానిస్తున్నారు. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి అనే విషయంలో కొందరు పరిశోధన జరిపారు.
undefined
దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండడం ఇటీవల కాలంలో ఎక్కువయింది
undefined
వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండడం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్‌ పీరియడ్‌గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.
undefined
మరో సర్వేలో తేలిన విషయం ఏమిటంటే... మరీ ముఖ్యంగా 40ఏళ్లు దాటిన తర్వాతే స్త్రీలు ఎక్కువ వివాహతేర సంబంధాలపై మోజు చూపిస్తుండటం విశేషం. ఆ వయసులో దాదాపు భర్తలు తమపై దృష్టి కాస్త పక్కన పెట్టేస్తారని.. ఆ తర్వాత పరాయి వ్యక్తి కాస్త ప్రేమ చూపించినా వెంటనే లొంగి పోవడం లాంటివి జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
click me!