ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తాయి. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ముఖ్యమైన పండ్లలో దానిమ్మ పండు ఒకటి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి-6, సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.