1.మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్య రశ్మి నుంచి లభిస్తుంది. కాబట్టి... ఉదయం పూట ఎండలో గడపడం వల్ల సూర్య రశ్మి ద్వారా విటమిన్ డి లభించే అవకాశం ఉంది. అయితే.. ఎప్పుడుపడితే అప్పుడు ఎండలోకి వెళ్లి నాకు విటమిన్ డి రాలేదు అని అనకూడదు. ఒకప్పుడు ఉదయం 7, 8గంట సమయంలో ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందని చెప్పేవారు. కానీ... ఉదయం 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే ఎక్కువగా సూర్య రశ్మిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందట.