4.ఈడీ, సీబీఐ దాడులతో దెబ్బ
కేంద్ర దర్యాప్తు సంస్థలు (ఈడీ, సీబీఐ) అధికార పార్టీకి చెందిన అగ్రనేతలపై దాడులు చేసి అరెస్టు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాయి, ఈ చర్యలు రాజకీయంగా ప్రేరేపించబడినవి, పక్షపాతంతో కూడుకున్నవని వాదించడానికి ఇండియా కూటమికి అవకాశం కల్పించింది. బీజేపీ అవినీతి అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసినా అది ఓటర్లలోకి అంతగా వెళ్లలేదు. ఇది కూడా జార్ఖండ్ లో బీజేపీని దెబ్బకొట్టింది.