డిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ఎవరెవరు హాజరయ్యారంటే..
డిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఎన్డిఏ భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు, డిల్లీ బిజెపి ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, మహారాష్ట్ర నుంచి దేవేంద్ర పడ్నవీస్, ఏక్నాథ్ షిండే , అజిత్ పవార్, మధ్యప్రదేశ్ నుంచి రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా, రాజస్థాన్ నుంచి దివ్య కుమారి, ప్రేమ్చంద్ బైర్వ, ఒడిశా నుంచి ప్రతిభా పరిదా, కనక్వర్ధన్ సింగ్, ఛత్తీస్గఢ్ నుంచి అరుణ్ సా, విజయ్ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి చౌనా మెయిన్, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీహార్ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి, ప్రెస్టోన్ టిన్సోంగ్, నార్టియాంగ్ నుంచి ఎమ్మెల్యే సంగియావ్ భాలాంగ్ ధార్, నాగాలాండ్ నుంచి టిఆర్ జెలియాంగ్, యంతుంగో పాటన్ రాంలీలా స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. .