పాకిస్తాన్లో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి హైజాక్ చేసింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిలో పలువురు భద్రతా అధికారులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు 215 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకున్నారు. లోకోపైలట్ను తీవ్రంగా గాయపరిచిన తర్వాత రైలు ఆగిపోవడంతో సాయుధులు రైలును చుట్టుముట్టారు.
ప్రయాణికులు, సైనికులను వేర్వేరుగా విడిపెట్టి సుమారు 30 మందిని కాల్చి చంపారు. మొత్తం 215 మందిని బందీలుగా పట్టుకున్నారు, వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్ సైన్యానికి, ఐఎస్ఐకి, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్కు చెందినవారు ఉన్నారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విమాన హైజాకింగ్ చాలాసార్లు జరిగింది, కానీ ఇది రైలు హైజాకింగ్కు సంబంధించిన మొదటి సంఘటన. కాగా ప్రపంచాన్ని కుదిపేసిన ఐదు అతిపెద్ద హైజాకింగ్ల గురించి తెలుసుకుందాం.