ప్రధానమంత్రిగా మోదీ మారిషన్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు మోదీ 2015లో మారిషస్ వెళ్లారు.
ఈ పర్యటన "భారత్-మారిషస్ సంబంధాలను బలోపేతం చేయడానికి" ఉపయోగపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
"భారత్-మారిషస్ సంబంధాలను బలోపేతం చేస్తున్నాం! ప్రదాని మారిషస్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మారిషస్ నాయకులు, ప్రముఖులతో సమావేశమవుతారు" అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Xలో పోస్ట్ చేశారు.