ఇద్దరు వ్యక్తులు రూ.37,500 విలువ చేసే సుమారు 550 కిలోల టమోటాలు దొంగిలించారు. మర్ఫీ టౌన్కు చెందిన వ్యాపారి ప్రశాంత్ టి (30) దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఆగస్టు 11 మధ్యాహ్నం 1గంట సమయంలో శివాజీనగర్ మార్కెట్ నుండి 22 కిలోలుండే.. 30 క్రేట్ల టమాటాలను కొనుగోలు చేశాడు. మర్ఫీ టౌన్ మార్కెట్లోని తన స్టాల్లో వాటిని దించేశాడు.