కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం టోల్ తగ్గింపుతో ఆగిపోకుండా, రవాణా ఖర్చును కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. వ్యాపారరంగం, ట్రాన్స్పోర్ట్ రంగానికి ఇది మంచి ఊతమివ్వనుంది.
ఇంకా ఈ కొత్త విధానం ఎప్పుడు నుంచీ అమల్లోకి వస్తుందో స్పష్టంగా ప్రకటించలేదు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో ఈ సంబంధిత ఉత్తర్వులను విడుదల చేసే అవకాశముంది. ఎలాంటి రహదారులు, ఏ ఏ ప్రాంతాల్లో ఈ తగ్గింపు అమలు అవుతుందో కూడా త్వరలో అధికారికంగా తెలియజేస్తారు.