ఈ ఫలితాల్లో ర్యాంకు టాప్ 100 ర్యాంకులు సాధించిన వారిలో 40 మంది ఐఐటి హైదరాబాద్ జోన్ ( తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులే ఉన్నారని తెలిపింది. ఈ 40 మందిలో 30 మంది తెలుగు వారే ఉండడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈసారి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.52 లక్షల మందిలో అడ్వాన్సుడ్ రాసేందుకు 1,89,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో 1,80,372 మంది పరీక్ష రాశారు.
వీరిలో కూడా కటాఫ్ మార్కుల ఆధారంగా 43,773మందికి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఈ కౌన్సిలింగ్లో పాల్గొన్న వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులవుతారు. ఇందులో 36వేల 254 మంది అబ్బాయిలు ఉండగా.. 7509 మంది అమ్మాయిలు ఉన్నారు. నిరుడు ఐఐటీలో 16,598, ఎన్ఐటీల్లో 23వేల 994 సీట్లు ఉన్నాయి. ఈ 43వేల మందిలో దాదాపు 7వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నట్టు అంచనా.