రూ. 500 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన ఈ చిత్రం కోసం.. నిర్మాతలు విడుదలకు ముందునుంచే భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రైలర్ లాంచ్లో, దర్శకుడు ఓం రౌత్ ప్రతి స్క్రీనింగ్లో హనుమంతుని కోసం ఒక సీటును రిజర్వ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, సినిమా విడుదలైన కొన్ని గంటల తర్వాత, అభిమానులు.. విజువల్ ఎఫెక్ట్స్, జువెనైల్ డైలాగ్లను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.