నటి తల్లి మధు దూబే తరఫున కేసును స్వీకరించిన న్యాయవాది శషక్ శేఖర్ త్రిపాఠి, పోస్ట్మార్టం నివేదికపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ దీనిమీద వైద్య నిపుణుల సలహా తీసుకుంటున్నానని, దాని ఆధారంగా పోలీసుల కోసం ప్రశ్నలను సిద్ధం చేస్తున్నానని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని త్రిపాఠి బుధవారం డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు రాసిన లేఖలో, 25 ఏళ్ల నటి మరణం ఆత్మహత్య కాదని, హోటల్ గదిలో కొంతమంది ఆమెను చంపారని ఆరోపించారు.