Indian Railways: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారంటే ఇదేనేమో. కొంతమంది ఇలానే ఉంటారు. ఆఖరికి రైల్వే ఏసీ కోచ్ లో ఇచ్చే దుప్పట్లు, టవల్స్ తస్కరిస్తున్నారు. 4 ఏళ్లలో కోటీకిపైగా బెడ్రోల్ వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు. రైల్వేకు ఎంత నష్టమొచ్చిందో తెలుసా?
గుడిని వదలరు, గుడిలో లింగాన్ని వదలరు. ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారు. చేయి చూపిస్తే మండ మింగేస్తారు. ఈ సామెతలన్నీ కరెక్టుగా సరిపోతాయి. కొంతమంది ఏసీ రైలులో ప్రయాణిస్తూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సెల్ ఫోన్లు, డబ్బులు, ఇళ్లల్లో చోరీ చేసే వాళ్లని చూసే ఉంటాం. కానీ మీరాంట్రే ఇలా ఉన్నారు. ఇంతకీ ఏమైందో తెలుసా?
24
1.27కోట్ల బెడ్ రోల్ వస్తువులు మాయం
రైలులో ప్రయాణం పూర్తయ్యాక తమ సామాన్లతో దిగాల్సిన ప్రయాణికులు..కొందరు రైల్వే ఆస్తినే తమ లగేజీలో వేసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఏసీ కోచ్ లో ప్రయాణికులకు ఉచితంగా ఇచ్చే దుప్పట్లు, బెడ్ షీట్లు, ఫేస్ టవల్స్ను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఈ కక్కుర్తి కారణంగా గత నాలుగేళ్లలో భారతీయ రైల్వేకు చెందిన 1.27కోట్ల బెడ్ రోల్ వస్తువులు మాయమయ్యాయి. ఇందులో ఎక్కువగా టవల్స్, దుప్పట్లు, బ్లాంకెట్లు చోరీకి గురయ్యాయి. 2022 జనవరి నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 54 రైల్వే డివిజన్లలో చోరీ జరిగింది. దీనివల్ల గత నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్కు రూ.104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
34
రైల్వేకు రూ.104 కోట్లకు పైగా నష్టం
సాధారణంగా ఏసీ కోచ్ లో ప్రయాణించే వారికి దుప్పటి, బెడ్ షీట్, దిండు కవర్, ఫేస్ టవల్...ఇలా ఒక బెడ్ రోల్ కిట్ ఇస్తారు. ప్రయాణం కంప్లీట్ అయ్యాక మళ్లీ వాటిని అక్కడే వదిలేయాలి. ఇండియన్ రైల్వేస్ లో వర్క్ చేసే వాళ్లు వాటిని తీసుకెళ్లి ఉతికి శుభ్రం చేశాక..తర్వాత ప్రయాణికులకు ఇస్తారు. కానీ కొందరు వాటిని తమతో తీసుకెళ్తుండటంతో రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లుతోంది.
అధికారుల లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో ఒకరు కనీసం ఒక బెడ్ రోల్ వస్తువైనా ఎత్తుకెళ్తున్నారు. 2022లో పోలిస్తే 2025 నాటికి ఈ దొంగతనాలు 56 శాతం పెరిగాయట. దీంతో కొత్త బెడ్ రోల్స్ సరఫరా చేసే కాంట్రక్టర్లపై అదనపు భారం పడుతోందట. కొన్నిసార్లు ఇతర ప్రయాణికులకు సరిపడా బెడ్ రోల్స్ అందించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ చోరీలు ఎక్కువగా రాజస్థాన్ లోని బికనేర్ డివిజన్లో జరుగుతున్నట్లు గుర్తించారు.