ఢిల్లీ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బైటికి తీసుకువచ్చే రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. 17 రోజుల తర్వాత కూలిన సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు మంగళవారం రాత్రి సురక్షితంగా బైటికి వచ్చారు. మృత్యుంజయులైన ఆ కూలీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
కార్మికులంతా ఒక గదిలో ఉండి ప్రధానితో టెలిఫోన్లో మాట్లాడారు.
కార్మికులను విజయవంతంగా, సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని అంతకుముందే అభినందించారు.