ఈ కలెక్షన్కు చెందిన 2,000 జతల సాండల్స్ పూర్తిగా భారత్లోనే తయారీ చేయనున్నారు. ముఖ్యంగా.. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, సొలాపూర్, కర్ణాటకలోని బేలగావి, బాగల్కోట్, ధారవాడ, బీజాపూర్లో తయారు చేయనున్నారు. ఈ ఎనిమిది జిల్లాలకు చెందిన కార్మికులు స్వయంగా చేతులతో చెప్పులను తయారు చేస్తారు. ఇవి సంప్రదాయంగా ప్రత్యేక పద్ధతులతో చేతితో తయారుచేసే GI-ట్యాగ్ పొందిన చెప్పులు. ప్రాడా తమ తయారీ టెక్నాలజీని, భారతీయ సంప్రదాయ పద్ధతులతో కలిపి ప్రపంచానికి పరిచయం చేయనుంది.