“2017లో జీఎస్టీ మొదలైనప్పటి నుండి పన్నుల చరిత్రలో కొత్త అధ్యాయం రాశామని గుర్తుచేశారు. “దశాబ్దాల పాటు మన దేశ ప్రజలు, వ్యాపారులు ఆక్ట్రోయ్, ఎంట్రీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నుల గజిబిజిలో చిక్కుకున్నారు. ఒక నగరం నుండి మరొక నగరానికి సరుకులు పంపడానికి అనేక చెక్పోస్టులు దాటాల్సి వచ్చేది” అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ ఒక ఉదాహరణ ప్రస్తావించారు. “2014లో నేను ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఒక విదేశీ పత్రికలో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఒక కంపెనీ బెంగళూరులో నుండి హైదరాబాద్కు (570 కి.మీ దూరం) సరుకులు పంపడం కష్టంగా అనిపించడంతో, మొదట యూరప్కు పంపి, అక్కడి నుండి హైదరాబాద్కు పంపడమే తక్కువ కష్టమని భావించింది. ఇదే పరిస్థితి అప్పట్లో అనేక కంపెనీలు ఎదుర్కొన్నాయి. చివరికి ఈ ఖర్చు పేదలకు, వినియోగదారులపై పడింది” అని అన్నారు.