ఇదిలా ఉండగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఇన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభకు ఏకకాల ఎన్నికలు, తరచుగా జరిగే ఎన్నికల వల్ల సమయం, ప్రజా నిధులు గణనీయంగా వృధా అవుతాయని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో ఇలాంటివి వుండవని పేర్కొన్నారు. ‘‘నేను వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ప్రచారం చేస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల సమయాన్ని వృథా చేస్తున్నా.. అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి" అని చౌహాన్ అన్నారు.