
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పతంగులే.. పిల్లలనుండి పెద్దల వరకు ఎంతో సంతోషంలో పతంగులు ఎగరేస్తుంటారు. అయితే ఈ సంతోషం కొన్ని సార్తు విషాదానికి దారి తీస్తుంటుంది.
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పతంగులే.. పిల్లలనుండి పెద్దల వరకు ఎంతో సంతోషంలో పతంగులు ఎగరేస్తుంటారు. అయితే ఈ సంతోషం కొన్ని సార్తు విషాదానికి దారి తీస్తుంటుంది.
అలా ఈ యేడు దేశవ్యాప్తంగా పంతంగులు ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు చాలామందే చనిపోయారు. తాజాగా ఓ పదేళ్ల బాలుడు పేడకుప్పలో పడి ఊపిరాడక చనిపోయాడు.
అలా ఈ యేడు దేశవ్యాప్తంగా పంతంగులు ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు చాలామందే చనిపోయారు. తాజాగా ఓ పదేళ్ల బాలుడు పేడకుప్పలో పడి ఊపిరాడక చనిపోయాడు.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది.
వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది.
షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు.
షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు.
ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లో కూడా ఇలాంటిదే ఓ విషాద ఘటన జరిగింది. పతంగి ఎగరేస్తూ ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు. ఈ ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది.
హైదరాబాద్ లో కూడా ఇలాంటిదే ఓ విషాద ఘటన జరిగింది. పతంగి ఎగరేస్తూ ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు. ఈ ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది.
గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగింది. బైక్ పై వెడుతున్న సమయంలో ప్రణయ్ అనే యువకుడి మెడకు పదునైన పతంగి మాంజా దారం చుట్టుకుంది. ప్రణయ్ గొంతును మాంజా దారం కోసేసింది. క్షణాల్లోనే బైక్పై నుంచి కిందపడి చనిపోయాడు.
గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగింది. బైక్ పై వెడుతున్న సమయంలో ప్రణయ్ అనే యువకుడి మెడకు పదునైన పతంగి మాంజా దారం చుట్టుకుంది. ప్రణయ్ గొంతును మాంజా దారం కోసేసింది. క్షణాల్లోనే బైక్పై నుంచి కిందపడి చనిపోయాడు.