నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోకి ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ,దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బిఫర్ జోయ్ తుఫాన్ కారణంగా రుతు పవనాలు మరింత ఆలస్యం కానున్నాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళ రాష్ట్రాన్ని తాకాయి. గత 20 ఏళ్లలో వారం రోజులు ఆలస్యంగా కేరళ రాష్ట్రాన్ని తాకడం ఈ ఏడాదే అని వాతావరణ శాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.