నీటిలో తేలియాడే రాళ్లు.. సైన్స్ ఏం చెబుతోంది?
వీడియోపై పలువురు ఎక్స్ వినియోగదారులు తమ అభిప్రాయాలు షేర్ చేశారు. “నీటిలో తేలే రాయిని ‘ప్యూమిస్ స్టోన్’ లేదా ‘ఝావన్ స్టోన్’ అంటారు. ఇది అగ్నిపర్వత లావాతో ఏర్పడే రాయి. ఇందులో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఇవి దాని ఘనత్వాన్ని నీటి కన్నా తక్కువగా చేస్తాయి, అందువల్ల ఇది తేలుతుంది” అని ఒక యూజర్ పేర్కొన్నారు. మరొకరు.. “ఈ రాయి నీటిలో ఎలా తేలుతుంది అనే విషయంలో ఆశ్చర్యం అవసరం లేదు. ఇది ప్యూమిస్ రాయి” అని కామెంట్స్ చేశారు.
సైన్స్ ప్రకారం.. 'ప్యూమిస్' అనే రాయి నీటిపై తేలుతుంది. ప్యూమిస్ రాయి లావా గట్టిపడిన రూపం. రాయి నీటి కంటే బరువైనది, కాబట్టి అది నీటిలో మునిగిపోతుంది, కానీ గాలి లోపల చిక్కుకున్నప్పుడు, అది రాయి బరువును తగ్గిస్తుంది. రాయి నీటిపై తేలుతుంది.
ఈ ఘటన మత విశ్వాసాలు లేదా వారి నమ్మకాలను నమ్మే వారికీ, శాస్త్రీయంగా ఆలోచించే వారికీ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని బయటపెట్టింది. గంగా నదిలో తేలుతున్న ఈ రాయి విషయంలో జనాల్లో ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. ఇది ప్రకృతిలో సహజంగా ఏర్పడే ఒక రకం రాయి మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.