న్యూఢిల్లీ : ముప్పై మంది పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, ఆపై హత్య చేసిన నిందితుడికి ఢిల్లీ కోర్టు ఈ రోజు జీవిత ఖైదు విధించింది. మే 6న, రోహిణిలోని కోర్టు రవీందర్ కుమార్ను ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించింది. గత వారం శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా, కుమార్ ఆదాయం, ఆస్తులపై కోర్టుకు నివేదిక అందకపోవడంతో వాయిదా పడింది.