పెళ్లైన రెండోరోజే వధువు పరార్.. కదులుతున్న రైల్లో ప్రియుడితో మళ్ళీ పెళ్లి... ఫొటోలు వైరల్..

First Published Jun 12, 2021, 11:10 AM IST

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది. 

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది.
undefined
ఆ తర్వాత ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని రైల్వే స్టేషన్ లో కలిసి బెంగళూరు వెల్తున్న రైలు ఎక్కింది. కదులుతున్న రైల్లోనే ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. అలా ఆ ప్రేమ జంట ఒక్కటయ్యింది. వివరాల్లోకి వెడితే...
undefined
బీహార్ కు చెందిన అనుకుమారి, అషుకుమార్ లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇది నచ్చని అనుకుమారి తల్లిదండ్రులు ఆమెకు రెండు నెలల క్రితం కిరణ్ పూర్ గ్రామానికి చెందిన యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ అను ఆ యువకుడిని భర్తగా ఒప్పుకోలేక పెళ్లైన రెండో రోజే అత్తగారింటినుంచి పారిపోయి వచ్చింది.
undefined
ఆ తరువాత అషు కుమార్ ను సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ లో కలిసింది. వారిద్దరు కలిసి బెంగళూరు వెల్తున్న రైలు ఎక్కారు. నీ కోసం తాను కట్టుకన్న భర్తను వదిలేసి వచ్చానని మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అను అషుకుమార్ మీద ఒత్తిడి తెచ్చింది.
undefined
దీంతో చేసేదేం లేక కదులుతున్న రైలులోనే ఆమెకు నుదుట సింధూరం పెట్టాడు. ఇది జరిగి రెండు నెలలు అయిన తరువాత తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగుచూడడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
click me!