మామతో అక్రమసంబంధం, అత్తను చంపి.. కాల్చి, ఇంట్లో పాతిపెట్టిన కోడలు..

First Published Jun 10, 2021, 12:26 PM IST

కోడళ్లను కిరసనాయిల్ పోసి చంపే అత్తల గురించి ఇప్పటివరకు విన్నాం.. కానీ ఓ కోడలే అత్తను చంపి, సీక్రెట్ గా కాల్చి, ఇంట్లోనే పూడ్చిపెట్టే ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. 

కోడళ్లను కిరసనాయిల్ పోసి చంపే అత్తల గురించి ఇప్పటివరకు విన్నాం.. కానీ ఓ కోడలే అత్తను చంపి, సీక్రెట్ గా కాల్చి, ఇంట్లోనే పూడ్చిపెట్టే ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.అత్తతో గొడవపడి ఆమెను రాడ్ తో కొట్టి చంపింది ఓ కోడలు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేయాలని ప్రయత్నించింది. అయితే ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. కోడలిని అరెస్ట్ చేశారు.
undefined
పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు కోడలికి మామతో శారీరక సంబంధం ఉంది. దీనిమీద అత్తకు అనుమానం రావడంతో అడ్డుతొలిగించుకోవడానికి హత్య చేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెడితే....
undefined
అహ్మదాబాద్ లోని ఘోటా ఏరియాలోని రాయల్ హోమ్స్ కాలనీలో ఈ దారుణం జరిగింది. మంగళవారం రాత్రి అత్త రేఖా అగర్వాల్ తలమీద కోడలు నిఖితా అలియాస్ న్యారా రాడ్ తో కొట్టి చంపింది. రేఖా అగర్వాల్ కొడుకు దీపక్ తో ఈ జనవరిలో నిఖితాకు పెళ్లయ్యింది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే అత్తాకోడళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.
undefined
దీనికి కారణం.. పెళ్లైన కొద్దిరోజులకే నిఖితకు భర్త తండ్రి అయిన మామతో సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని శారీరకసుఖం పొందేవారు. దీనికోసం వీరిద్దరు ఇంట్లోనే కాకుండా నగరానికి వెలుపల హోటల్స్ కు కూడా వెళ్లేవాళ్లు. అయితే రహస్యం ఎన్ని రోజులు దాగుతుంది. అత్తకు అనుమానం మొదలయ్యింది.ఇదిలా ఉండగా, నిందితురాలు నిఖిత గర్భవతి అయ్యింది. అయితే ఆమె గర్భంలో పెరుగుతున్నది మామ సంతానమే అని అత్త అనుమానించింది. దీంతో నిఖితతో గొడవపడడం మొదలు పెట్టింది. అలాగే మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఈ విషయంగా గొడవ జరిగింది. గొడవ ముదరడంతో కోడలు అత్త నెత్తిమీద రాడ్ తో కొట్టి చంపింది.
undefined
విచారణలో పోలీసులకు నిఖితా మొబైల్ లో ఆమె మామ పంపిన ఓ మెసేజ్ దొరికింది. అందులో ‘ఆమె ఇప్పటికీ దీపక్ కు దూరంగానే ఉంది. అంటే ఆమె భర్త’ అని ఉంది. ఈ మెసేజ్ ను అక్టోబర్ 24 నాడు మామ మొబైల్ నుంచి పంపబడింది. ఈ సమయంలో మామ కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను బైటికి వచ్చాక పోలీసులు అతన్ని విచారించనున్నారు.
undefined
హత్య జరిగిన సమయంలో నిఖిత భర్త దీపక్ పక్కనే ఉన్న గుడికి వెళ్లాడు. గుడినుంచి వచ్చాక ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి బాల్కనీలోనుంచి దూకి ఇంట్లోకి వెళ్లేసరికి షాక్ తిన్నారు. గదినిండా రక్తం.. సగం కాలిన స్థితిలో తల్లి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు నికితను అరెస్ట్ చేశారు.
undefined
click me!