ఇక మరికొంతమంది నాగా సాధువులు కుంభమేళా తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాలలో నివసిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాలలో వారు ధార్మిక సాధన చేస్తూ ఉంటారు.
మరికొందరు నాగా సాధువులు ధార్మిక యాత్రలు కూడా చేస్తూ వుంటారు. వివిధ తీర్థక్షేత్రాలు సందర్శిస్తూ, తమ జ్ఞానం, సాధన ద్వారా సమాజానికి ధార్మిక బోధనలు చేస్తారు. ఈ యాత్రల్లో వారు సత్యం, ముక్తి కోసం అన్వేషిస్తారు.