వేగానికి వస్తే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లతో పోటీపడుతుంది. గరీబ్ రథ్తో సహా భారతీయ రైళ్ల సరాసరి వేగం గంటకు 66–96 కి.మీ మాత్రమే. గరీబ్ రథ్ నిరంతరం గంటకు సగటున 70–75 కి.మీ వేగంతో నడుస్తుంది, ఇది సౌకర్యవంతమైంది... సకాలంలో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది.
చెన్నై- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అత్యంత దూరం దూరం నడిచే రైలుగా రికార్డు సృష్టించింది. చెన్నై మరియు ఢిల్లీ మధ్య 2,075 కి.మీ దూరాన్ని ఈ రైలు 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ మార్గం టిక్కెట్ ధర ₹1,500.
రాజధాని ఎక్స్ప్రెస్ అదే దూరాన్ని 28 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది, కానీ ఇందులో థర్డ్ ఏసీ టిక్కెట్ ధర ₹4,210. ఇది గరీబ్ రథ్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
కిలోమీటరుకు 68 పైసల వరకు తక్కువ ధరతో, సౌకర్యం, సౌఖ్యంలో రాజీ పడకుండా చౌకైన ఏసీ ప్రయాణాన్ని కోరుకునే వారికి గరీబ్ రథ్ ఒక అనువైన ఎంపిక.