భర్త మోసం గురించి తెలిసినా 28ఏళ్ళ ఈ వివాహిత ఇంతకాలం బయటపెట్టలేదు. అయితే భర్త వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఆమె ఇక భరించలేకపోయింది. భర్త చేసిన మోసం, ఇంతకాలం అతడి బ్లాక్ మెయిల్ తో ఎంతలా నరకం అనుభవించిందో మొత్తం బయటపెట్టింది. బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.