మృతదేహం కనిపించకపోవడంతో గ్రామస్తులు, పోలీసులు తికం మానసిక పరిస్థితి బాగోలేదని భావించారు. కాగా, తికం పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. చంపేసిన స్నేహితుడి ఆత్మ కలలో కనిపిస్తోందని గోల ఎక్కువయ్యింది. అతను పగలు, రాత్రి కళ్లముందు కనిపిస్తున్నాడని చెబుతుండేవాడు. ఈ సమయంలో, ఛవేశ్వర్ కుటుంబం పోలీసులపై ఈ కేసును సాల్వ్ చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఛమేశ్వర్ మృతి సంఘటనపై విచారణకు డిమాండ్ చేసింది.