యాస్ తుపాన్ : పౌర్ణమి, చంద్రగ్రహణం... తీర ప్రాంతాల్లో పెను బీభత్సం.. ఐఎండీ

First Published May 26, 2021, 3:23 PM IST

దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యాస్ తుపాన్ ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి  11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటిన టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బెంగాల్, ఒడిశా  తీరప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపాన్ కు ఇప్పుడు పున్నమి కూడా తోడైంది. 

దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యాస్ తుపాన్ ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటిన టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపాన్ కు ఇప్పుడు పున్నమి కూడా తోడైంది.
undefined
దీంతో మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు పౌర్ణమి, దీనికితోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో తీర ప్రాంతాల్లో తుపాన్ పెను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించారు. బెంగాల్లోని ఐదు సబ్ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాగులు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు.
undefined
సాధారణంగా జాబిల్లి భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ మూన్ గా కనిపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్లో బుధవారం మధ్యాహ్నం 3.15 నిమిషాల నుంచి చంద్రగ్రహణం మొదలవుతుంది. దీంతో ఈ సాయంత్రం తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
undefined
ఇదిలా ఉండగా యస్ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంతాలు అల్లాడి పోతున్నాయి. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండడంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.
undefined
ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ మరో మూడు గంటల్లో బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ ప్రభావంతో జార్ఖండ్ లోనూ భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.
undefined
తుఫాను ప్రభావంతో ముంబై నుంచి బెంగాల్, ఒడిస్సా వెళ్లే విమానాలు రద్దయ్యాయి. చత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ నుంచి కోల్ కతా, భువనేశ్వర్ వెళ్లే ఆరు విమాన సర్వీసులను ఎయిర్ పోర్ట్ అధికారులు రద్దు చేశారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
undefined
click me!