బ్లాక్ ఫంగస్ భారత్ కే పరిమితమా? ఎందుకలా...

First Published May 25, 2021, 4:33 PM IST

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ మరో వైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ దేశాన్ని ముప్పేటలా దాడి చేస్తున్నాయి. రోజువారీ మరణాల సంఖ్యలో పెరుగుదలతో పెద్ద తలనొప్పిగా మారింది. మ్యూకర్‌మైకాసిస్ అని కూడా పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ భారతదేశంలో నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పేషంట్లే దీనికి ఎక్కువగా గురవుతున్నారు. 

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ మరో వైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ దేశాన్ని ముప్పేటలా దాడి చేస్తున్నాయి. రోజువారీ మరణాల సంఖ్యలో పెరుగుదలతో పెద్ద తలనొప్పిగా మారింది. మ్యూకర్‌మైకాసిస్ అని కూడా పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ భారతదేశంలో నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పేషంట్లే దీనికి ఎక్కువగా గురవుతున్నారు.
undefined
ఇప్పటికే భారత్లో 8,858 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. కరోనా లాగానే ఈ ఫంగస్ కూడా పెరిగిపోతే ఎలా? అందుకే, ఈ పరిస్థితిని నిలువరించడం కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ ఫంగస్ లేదా లేక మ్యూకర్‌మైకాసిస్‌ చికిత్సకు ముఖ్యమైన ఆంఫోటెరిసిన్-బి వయల్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
undefined
అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకర్‌మైసెటిస్ అనే వాటి వల్ల వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్. కేవలం భారతదేశంలోనే కాదు చైనా వంటి దేశాల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్, రోగ నిరోధక శక్తిని తగ్గించే హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ ఫంగస్ టార్గెట్ చేస్తుంది.
undefined
ఇప్పుడు కరోనా పేషెంట్లు అందులోనూ డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్న వారిపై ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారత్లో ఈ ఫంగస్ పెరగడానికి కారణం ఏమిటని చాలా మంది ప్రశ్నలు కురిపిస్తున్నారు. దీనికి కొందరు నిపుణులు చెబుతున్న సమాధానం ఏమిటంటే భారత్లో చాలాచోట్ల పేషెంట్లకు ఆక్సిజన్ అందించడంలో అపరిశుభ్ర పద్ధతులు అమలు చేస్తున్నారట.
undefined
బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ఇది ఒక కారణం. దీంతో పాటు కరోనా చికిత్సలో విపరీతంగా వాడే స్టెరాయిడ్లు కూడా ఒక కారణమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండింటినీ అదుపు చేయడం దాదాపు అసాధ్యం.
undefined
మరి ఈ ఫంగస్ ఇతర దేశాల్లో కనిపించలేదా? అదే నిజమైతే ఎందుకు ఇలా జరిగింది ? అనేది కీలకమైన ప్రశ్న. ప్రపంచం మొత్తం కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ సమస్య కేవలం భారత్ ని ఎందుకు ఇంతలా పీడిస్తోంది? అంటే దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఈ సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచం మొత్తం నమోదైన కేసులు 71% భారత్లోనే ఉన్నమాట మాత్రం వాస్తవం. మిగతావాటిలో ఎక్కువ భాగం దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ, రష్యాలోనూ కనిపించాయి. ఇటీవల కాలంలో రష్యాలో ఈ ఫంగస్ కేసులు బాగా పెరిగాయని సమాచారం.
undefined
ఇక్కడ కూడా భారత్‌లోలానే కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ లోనే ఈ ఫంగస్ ఎక్కువగా వెలుగు చూస్తుంది. రష్యా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఇది అంటువ్యాధి కాదని, కాబట్టి ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేదని మాత్రం తెలిపింది. అంటే కరోనాతో పాటు భారతీయులను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ కేవలం మన దేశానికి పరిమితమైన సమస్య కాదు. మిగతా దేశాల్లో కూడా ఇదే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాని మన దేశంలో మాత్రం పరిస్థితులు మరి భయానకంగా ఉన్నాయి.
undefined
click me!