భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, ఆ తరువాత గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కుటుంబం, శివ్ నాడార్, దిలీప్ సాంఘ్వీ ఉన్నారు.
దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏడాదికేడాది గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇలా బిలియనీర్లుగా మారుతున్నవారిలో చాలామంది కష్టపడి ఎదిగినవారే. తొలినాళ్లలో చిరు ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఆరంభంలో ఏ బిలియనీర్ ఎలాంటి ఉద్యోగం చేసారో తెలుసుకుందాం.