వివాహేతర సంబంధం : వివాహితకు, ప్రియుడికి చెప్పుల దండలు వేసి, ఊరేగించిన గ్రామస్థులు..

Published : May 16, 2023, 02:02 PM IST

కట్నీ జిల్లాలోని స్లీమనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వివాహిత, ఆమె ప్రియుడిగా ఆరోపిస్తున్న వ్యక్తిని మెడలో బూట్ల దండతో ఊరేగించారు.

PREV
17
 వివాహేతర సంబంధం : వివాహితకు, ప్రియుడికి చెప్పుల దండలు వేసి, ఊరేగించిన గ్రామస్థులు..

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో ఓ దారుణమైన వీడియో వెలుగు చూసింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ మహిళ, ఓ యువకుడికి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. 

27

జిల్లాలోని ని స్లీమనాబాద్‌లో 27 ఏళ్ల యువకుడికి,ఒక మహిళకి బూట్లతో దండలు వేసి గ్రామస్తులు ఊరేగించిన వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మధ్యప్రదేశ్ పోలీసులు దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు. ఈ జంటకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో గ్రామస్తులు ఈ ఘాతుకానికి ఒడి గట్టారని పోలీసులు తెలిపారు. 

37

"మే 10 మధ్యాహ్నం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ అనే యువకుడు పిపారియా గ్రామానికి వచ్చాడని.. ఆ గ్రామానికి చెందిన వివాహిత, స్థానికులతో మాట్లాడుతున్నట్లుగా డయల్ 100కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సాలార్‌పూర్ ఉప సర్పంచ్ విశ్వనాథ్ సింగ్ చేశాడు. ఆ యువకుడిని పట్టుకున్నామని.. పోలీసులు రావాలని చెప్పినట్లు స్లీమనాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విపిన్ సింగ్ ఆదివారం తెలిపారు.

47

సమాచారం అందుకున్న పోలీసు బృందం గ్రామానికి చేరుకుంది, అక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళ భర్త, మహిళ కుటుంబ సభ్యులు, యువకుడు తదితరులు ఉన్నారు. వారు అప్పటికే ఒక పంచాయితీ నిర్వహించారు. ఇందులో గీతా సింగ్ అనే వివాహిన, రాహుల్ అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని..  వారిద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. వారిని తమ గ్రామంనుంచి అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిపంపాలని వారు పోలీసులతో చెప్పారని ఆయన తెలిపారు.

57

"పోలీసులు అక్కడే ఉన్న మహిళ, యువకుడిని వారిమీద ఏదైనా దాడి జరిగిందా అని అడిగారు. కానీ వారు అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్థులు ఆ మహిళ, యువకుడిని గ్రామం నుండి పంపించేశారు. ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు. కానీ ఆ తరువాత మే 13న దీనికి సంబంధించి మాకు ఫోటో, వీడియో అందాయి. అందులో యువకుడు, మహిళ బూట్ల దండతో కనిపించారు" అని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.

67

దీనిమీద ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. తమకొచ్చిన వీడియోలు, ఫొటోల ఆధారంగా విచారణ కొనసాగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కట్ని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిజిత్ కుమార్ రంజన్ మాట్లాడుతూ, "ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది, ఈ సంఘటన జిల్లాలోని స్లీమనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రాథమిక విచారణలో, ఈ సంఘటన జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె ప్రేమికుడు,  ఆమె భర్త మధ్య గొడవ కారణంగా ఇలా జరిగిందని తేలింది. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు" అన్నారు.

77

కానీ, "ఈ విషయానికి సంబంధించి మాకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు, అయితే, మేము దీనిని సుమోటుగా స్వీకరించి, చర్యలు తీసుకుంటున్నాం. దోషులుగా తేలితే, వారిపై చర్యలు తీసుకుంటాం" అని చెప్పుకొచ్చారు. 

click me!

Recommended Stories