లైంగిక దాడి వీడియో వైరల్... కీచకులు వీరే, వెలుగులోకి షాకింగ్ నిజాలు... !!

First Published May 28, 2021, 10:04 AM IST

సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురువారాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటన మీద కేఎస్ యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, ఐపీఎస్ అధికారి రాబిన్ హిబు, మేఘాలయా మెమ్మల్యే అంపరీన్ రంగంలోకి దిగారు. దీంతో 24 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం.
undefined
మొదట ఆ వీడియో నాగాలాండ్ లో ఆత్మహత్య చేసుకున్న ఓ 25 యేళ్ల యువతిదని, ఆ అవమానం తట్టుకోలేకే ఆమె చనిపోయిందని ప్రచారం జరిగింది. ట్విట్టర్ లో బాధితురాలికి న్యాయం జరగాలని క్యాంపెయిన్ కూడా జరిగింది. అయితే అది ఆమె వీడియో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదికారులు.
undefined
వీడియో, అందులోని విజువల్స్ ఆధారంగా ఫొటోలు రిలీజ్ చేసిన అస్సాం పోలీసులు.. నిందితుల ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ప్రకటిస్తూ ఫేస్ బుక్ లో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆపై ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్ చేవారు. అయితే నిందితుల్లో ఒకరి ఫేస్ బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
undefined
ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని, లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితురాలి వయసు 22 సంవత్సరాలని, ఎన్ఆర్ఐ కాలనీలో వారం క్రితం ఆమె మీద సామూహిక అత్యాచారం జరిపారని తెలుస్తోంది. అయితే నిందితుల గాయాల గురించి మాత్రం పోలీసులు స్పందించకపోవడం విశేషం.
undefined
కాగా, ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బాధితురాలితో సహా నిందితులంతా బంగ్లాదేశ్ కు చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా అక్రమంగా చొరబడి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారని, ఘటన మీద దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వాళ్లంతా వ్యభిచారం చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే బాధితురాలిమీద అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ప్రతిభా రామన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
undefined
ఇక నిందితులతో పాటు బాధితురాలిని ఐడెంటిటీని బంగ్లాదేశ్ ధృవీకరించింది. బాధితురాలు మోఘ్ బజార్ (ఢాకా) నివాసి అని, సౌదీకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి మూడు నెలల నుంచి జాడ లేకుండా పోయిందని తేజ్ గావ్ డీసీపీ సహీదుల్లా వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకడు టిక్ టాక్ లో ‘హ్రిదోయ్ బాబు’గా బంగ్లాదేశ్ పాపులర్ అని తెలుస్తోంది.
undefined
click me!