డిల్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఓటింగ్ శాతం ఎంత?
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(శనివారం) వెలువడ్డాయి. గత నెలరోజులుగా దేశ రాజధానికి కొనసాగిన ఎన్నికల హడావిడికి నేటితో తెరపడింది. ఏ పార్టీ భవితవ్యం ఏమిటి? డిల్లీ ప్రజలు ఎవరి పక్షాన నిలిచారో తేలిపోయింది. సామాన్యుడి పార్టీగా గుర్తింపుపొందిన ఆప్ ను ఈసారి డిల్లీ కామన్ మ్యాన్ నమ్మలేదు... కాషాయ పార్టీ బిజెపికి పట్టం గట్టారు.
బిజెపి అత్యధిక సీట్లను, ఓట్లను సాధించింది. బిజెపికి దాదాపు 46 శాతం ఓట్ షేర్ వచ్చింది. రెండోస్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం వచ్చింది. దేశ రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కేవలం 6.39 శాతం ఓట్ షేర్ వచ్చింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిల్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ పరంగా హైదరబాదీ పార్టీ నాలుగోస్థానంలో నిలిచింది. ఏఐఎంఐఎం పార్టీకి 0.79 శాతం ఓట్లు పడ్డాయి. చాలా ఉత్తరాది పార్టీల కంటే మజ్లిస్ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అంతెందుకు డిల్లీలో చాలాకాలం అధికారంలో వున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పోలిస్తే ఎంఐఎం గొప్పగానే పనిచేసిందని చెప్పవచ్చు.
ఇక డిల్లీ ఎన్నికల్లో పోటీచేసిన మరికొన్ని పార్టీల ఓట్ షేర్ ఇలావుంది. జెడి(యు) 0.67 శాతం, బిఎస్పి 0.57 శాతం, ఎల్జెపిఆర్వి 0.56 శాతం ఓట్ షేర్ సాధించాయి.
నోటాకు 0.56 శాతం ఓట్లు పడ్డాయి.