Delhi Assembly Elections 2025 : డిల్లీలో మోగిన ఎన్నికల నగారా ... షెడ్యూల్ ఇదే

Published : Jan 07, 2025, 03:03 PM ISTUpdated : Jan 07, 2025, 04:03 PM IST

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా దేశ రాజధానిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై పిబ్రవరితో ముగుస్తుంది. 

PREV
13
Delhi Assembly Elections 2025 : డిల్లీలో మోగిన ఎన్నికల నగారా ... షెడ్యూల్ ఇదే
Delhi Assembly Elections 2025

Delhi Assembly Elections 2025 : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమీషన్ సిద్దమయ్యింది. డిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ లో పోలింగ్ నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. డిల్లీ ఎన్నికల ప్రక్రియ జనవరి 2025 లో ప్రారంభమై ఫిబ్రవరిలో ముగియనుంది.

డిల్లీలోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు 58 జనరల్, 12 రిజర్వుడ్ వున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి మద్యనే వుండనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది.  

 
 

23
Delhi Assembly Elections 2025

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ :

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్  - 10 జనవరి 2025 (ఈరోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది) 

నామినేషన్ దాఖలుకు చివరితేదీ -  17 జనవరి 2025 

నామినేషన్లు స్క్రూటినీ  - 18 జనవరి 2025 

నామినేషన్ల ఉపసంహరణ - 20 జనవరి 2025

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ - 05 ఫిబ్రవరి 2025 

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు - 08 ఫిబ్రవరి 2025 

ఫిబ్రవరి 10, 2025 లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముస్తుందని సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు.

33
Delhi Assembly Elections 2025

2020 లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు : 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటిలాగే 2020లో జనవరిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఫిబ్రవరిలో ముగిసింది. జనవరి 6, 2020 లో నోటిఫికేషన్ వెలువడగా ఫిబ్రవరి 10, 2020లో పోలింగ్ జరింగింది. ఫిబ్రవరి 11, 2020 లో ఓట్ల లెక్కింపు జరగగా ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. 

ఆప్ పార్టీ ఊహకందని విధంగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 సీట్లు సాధించింది. బిజెపి కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం...సుదీర్ఘకాలం డిల్లీని పాలించిన హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు...  ఓట్లు కూడా పెద్దగా పడలేవు. 

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టింది బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ. ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది బిజెపి. ఇప్పుడు ఆ పార్టీ దృష్టి మొత్తం డిల్లీ అసెంబ్లీపై వుంది. ఎలాగయినా డిల్లీలో విజయం సాధించాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. 

మరోవైపు ఆప్ కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టేందుకు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఆప్. కానీ బిజెపి, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల వేటలో వున్నాయి.  

 
 

Read more Photos on
click me!

Recommended Stories