ఈ నెల 18వ తేదీ నుండి కొన్ని వస్తువులు, సరుకులపై జీఎస్టీ రేట్లను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రజలు నిత్యం ఉపయోగించే సరుకులపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.ఆదాయం కోసమే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. జీఎస్టీ పెంపుతో పలు వస్తువులు,సరుకుల ధరలు భారీ గా పెగిగాయి. ముఖ్యంగా పెరుగు, గోధమలు, పిండి వంటి వాటిపై జీఎస్టీ ధరల పెంపును విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచే విషయమై చర్యలు తీసుకోకుండా ధరలు పెంచే విషయమై బీజేపీ సర్కార్ ఆసక్తిని చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.