చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని గురజాడ చెప్పిన మాటను బిహార్లోని
పుర్నియా జిల్లా కలెక్టర్ కచ్చితంగా పాటిస్తున్నారు. వట్టికోట అళ్వారు స్వామి గ్రంథాలయోద్యమానికి పాటుపడ్డట్టే
పుర్నియా జిల్లాలో ప్రతి గ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 52.09 శాతం అక్షరాస్యత ఉన్న ఆ జిల్లా
ఇప్పుడు పుస్తకాల పురుగులకు స్వర్గదామంగా నిలుస్తున్నది. దీంతో పట్టణ, గ్రామీణంలో యువత, విద్యార్థులు
గ్రంథాలయాల బాటపడుతున్నారు. పుస్తకాలు, పేపర్లు, కాంపిటీటివ్ పుస్తకాల్లోకి తలలు దూరుస్తున్నారు.