బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి: అంబానీ, గాలి జనార్దన్ రెడ్డిలకు మించి

First Published Mar 2, 2020, 5:27 PM IST

భారతదేశంలో పెళ్లిళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రార్థిం ఒక్కరు తమ తాహత్ కి తగినట్టు, సాధ్యమైనంత గ్రాండ్ గా పెళ్లి చేయాలనీ భావిస్తుంటారు. డబ్బున్నోళ్ల సంగతయితే ఇక అది నెక్స్ట్ లెవెల్. వారు తమ పెళ్లిళ్లలోనే తమ సంతానం పట్ల ఉన్న ప్రేమనంతా చూపెట్టేయడానికి విశ్వా ప్రయత్నం చేస్తుంటారు.

భారతదేశంలో పెళ్లిళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రార్థిం ఒక్కరు తమ తాహత్ కి తగినట్టు, సాధ్యమైనంత గ్రాండ్ గా పెళ్లి చేయాలనీ భావిస్తుంటారు. డబ్బున్నోళ్ల సంగతయితే ఇక అది నెక్స్ట్ లెవెల్. వారు తమ పెళ్లిళ్లలోనే తమ సంతానం పట్ల ఉన్న ప్రేమనంతా చూపెట్టేయడానికి విశ్వా ప్రయత్నం చేస్తుంటారు.
undefined
2016లో గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లప్పుడు దేశమంతా కూడా 500 కోట్ల పెళ్లంటూ విస్తుపోయిన సంఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లా మజాకా మరి ఆ రేంజ్ లో ఉండాల్సిందే లెండి. ఇప్పుడు తాజాగా కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి ఇంట జరుగుతున్న పెళ్లి కూడా అదే రేంజ్ లో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.
undefined
ఆయన మరెవరో కాదండి గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు. డబ్బు ఎంత ఖర్చుపెడుతున్నాడో ఇంతవరకు ఖచ్చితమైన లెక్క రానప్పటికీ 9 రోజులపాటు గ్రాండ్ గా పెళ్లివేడుకను జరిపేందుకు డిసైడ్ అయి ఇప్పటికే ఆ తతంగాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు మార్చ్ 5వ తేదీన పెళ్లి జరిగే వరకు కొనసాగనున్నాయి.
undefined
ఇప్పుడీ పెళ్లి వేడుకలు కేవలం కర్ణాటకలోని కాకుండా మొత్తం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ 5వ తేదీన జరిగే పెళ్ళికి దేశం మొత్తం నుండి లక్ష మందికి ఆహ్వానాలను పంపారు. ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలకు కూడా ఆహ్వాన పత్రాలను పంపారు.
undefined
శ్రీరాములు కూతురు రక్షితను హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్త శెట్టిపల్లి లలిత్ సంజీవ్ రెడ్డికి ఇచ్చి ఈ నెల 5వ తేదీన గ్రాండ్ గా బెంగుళూరు లోని బేంగలూరు పాలస్ లో ఇచ్చి వివాహం జరుపుతున్నట్టుగా ఇప్పటికే ముద్రించిన ఆహ్వాన పత్రిక అందరి చూపును ఆకర్షిస్తుంది.
undefined
శ్రీరాములు కూతురు వివాహానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా దీపికా పదుకొనే వివాహానికి వర్క్ చేసిన సానియా సర్ధారియా వ్యవహరిస్తున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో కర్ణాటకలోని వివిధ దేవాలయాల నమూనాలను తలపిస్తూ వేసిన అనేక సెట్లలో ఈ వివాహ వేడుక జరగనుంది.
undefined
మార్చ్ 5వ తేదీ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వివాహ వేడుక జరగనుంది.  గాలి జనార్దన్ రెడ్డి ఖర్చు పెట్టినంత భారీ స్థాయిలో ఖర్చుపెడుతున్నాడో లేదో తెలియకున్నప్పటికీ ఈ వేడుక కూడా భారీ స్థాయిలోనే జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
undefined
click me!