దీపావళి పండు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది దీపాలే. పిల్లలు, కుర్రాకరు బాణాసంచాపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, బాణాసంచా లేకున్నా.. దీపాలు వెలిగించడం మాత్రం ఆగదు. మారుమూల గ్రామమైనా.. నగరం నడిబొడ్డునైనా దీపాలంకరణ కచ్చితంగా ఉంటుంది. ఈ దీపాలతో ఇల్లు ముస్తాబవుతుంది. ఈ దీపాలు నివాసాల్లోనే కాదు.. ఆలయాల్లో అంతకు మించి అన్నట్టుగా ఉంటాయి. దీపావళికి ఒకట్రెండు రోజులు ముందు నుంచే మందిరాలు దీపాలతో సింగారించుకుంటాయి.