అయోధ్య : భారతదేశంలోని మెజారిటీ ప్రజల శతాబ్దాల కల నెరవేరబోతోంది. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్యమైన రామమందిరం ఎట్టకేలకు నిర్మితమయ్యింది. అద్భుత శిల్పకళ, ఆశ్చర్యపరిచే అందాలతో అయోధ్య రామయ్య ఆలయం రెడీ అయ్యింది. ఈ ఆలయాన్ని దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులందరి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. నవంబర్ 22న జరిగే ఈ రామమందిర ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యాక్రమంలో అయోధ్యా నగరం సుందరంగా ముస్తాబవుతోంది.