రాకేశ్ శర్మ మొదలు.. దేశం గర్వించదగ్గ వ్యోమగాములు వీరే

Published : Apr 12, 2022, 04:45 PM IST

ఈ రోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డే 2020 సందర్భంగా మన దేశం గర్వించదగ్గ వ్యోమగాములను స్మరించుకోవడం కనీస ధర్మం. ఈ నేపథ్యంలోనే రాకేశ్ శర్మ మొదలు రోదసిలో భారత ఖ్యాతిని పెంచిన మరో ముగ్గురు ధీరవనితల గురించి చూద్దాం. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, శిరీష బండ్ల గురించి తెలుసుకుందాం.  

PREV
14
రాకేశ్ శర్మ మొదలు.. దేశం గర్వించదగ్గ వ్యోమగాములు వీరే

Rakesh Sharma became the first Indian to travel in Space in a Soviet rocket in the year 1984.

నేడు ప్రపంచమంతా అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాయి. మన దేశం కూడా ఈ రంగంలో ముందంజలో ఉన్నది. అమెరికా, రష్యా వంటి దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా నిలవడానికి ఎందరో కృషి ఉన్నది. ఈ రోజు అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష వాహక దినోత్సవం. ఈ సందర్భంగా అంతరిక్షం రంగంలో భారత్‌ గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖులను స్మరిద్దాం. రాకేశ్ శర్మ మొదలు నలుగురు కీలకమైన నలుగురు వ్యోమగాములను గుర్తు చేసుకుందాం. ఈ జాబితాలో తొలి పేరు కచ్చితంగా రాకేశ్ శర్మ పేరే వస్తుంది.

రాకేశ్ శర్మ భారత తొలి వ్యోమగామి. ఆయన సల్యూట్ 7 ఆర్బిటల్ స్టేషన్‌లో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి, ఏకైక భారతీయుడు రాకేశ్ శర్మనే. ఈయనతోపాటు పలువురు పేర్లూ మనం ప్రస్తావించవచ్చు. కానీ, వారిలో భారత మూలాలు ఉన్నా.. భారత పౌరులు కాదు.

రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ఓ ప్రశ్న వేశారు. స్పేస్ నుంచి భారత్‌ను చూస్తే ఎలా అనిపించింది? అని అడిగారు. ఇందుకు సమాధానంగా ఆయన ఇక్బాల్ రాసిన అద్భుత వ్యాఖ్యలను మననం చేసుకున్నారు. ‘సారే జహా సే అచ్చా’ అంటూ సమాధానం ఇచ్చి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

24
কল্পনা চাওলা

మన దేశంలో జన్మించి రోదసిలోకి వెళ్లిన తొలి మహిళ కల్పనా చావ్లా. కానీ, దురదృష్టవశాత్తు ఆమె 2003లో అంతరిక్షం నుంచి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా స్పేస్ షటిల్ పేలిపోయి మరణించారు. అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా ద్వారా ఆమె తొలిసారి 1997లో స్పేస్‌లోకి వెళ్లారు. మిషన్ స్పెషలిస్టుగా, ప్రాథమిక రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా ఆమె కొలంబియా స్పేస్ షటిల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తర్వాత 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ద్వారానే అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. కానీ, ఆమెతోపాటు మరో ఆరుగురు సభ్యులతో ఆ కొలంబియా స్పేస్ షటిల్ తిరిగి  వస్తుండగా మరికొద్ది నిమిషాల్లో భూమి ల్యాండ్ అయ్యే సమయంలో పేలిపోయింది. ఇందులో ఏడుగురు క్రూ సభ్యులు మరణించారు.

34

सुनीता विलियम्स का जून 1998 में अमेरिका की अंतरिक्ष एजेंसी नासा में चयन हुआ था। सुनीता ने 30 अलग-अलग अंतरिक्ष यानों में 2770 उड़ानें भरीं। वे 2006 में पहली बार अंतरिक्ष गई थीं। चूंकि 2003 की शुरुआत में कोलंबिया हादसा हुआ था, जिसमें कल्पना चावला सहित कई अंतरिक्ष यात्रियों को खो दिया था, इसलिए सुनीता का मिशन टलता रहा।

అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండియన్ అమెరికన్ మహిళ సునీతా విలియమ్స్. ఎక్కవ సార్లు అంతరిక్షంలో నడిచిన మహిళగా ఆమె పేరిట గతంలో రికార్డులు ఉండేవి. ఆమె ఏడు సార్లు రోదసీలో నడిచారు. 50 గంటల 40 నిమిషాల దీర్ఘకాలం స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆమె అప్పట్లో రికార్డు నెలకొల్పారు. తద్వార అంతర్జాతీయంగా ఆమె మన్ననలు పొందారు.
 

44

Sirisha Bandla, space flight, Sirisha Bandla profile, Sirisha Bandla birth place, Sirisha Bandla space

కాగా, స్పేస్ చేరిన మూడో భారత సంతతి మహిళ శిరీష బండ్ల. బ్రిటన్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ నిర్వహించిన స్పేస్ టూర్‌లో ఆయనతోపాటు వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్ ద్వారా శిరీష కూడా అంతరిక్షం అంచులకు వెళ్లి వచ్చారు. ఆమెతోపాటు మరో ఐదుగురితో కలిసి ఆమె ఈ ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పుట్టిన శిరీష యూఎస్‌లోని హూస్టన్ నగరంలో పెరిగి పెద్దయ్యారు.

click me!

Recommended Stories