దీంతో మార్చి 8, 2021 న, ఆమె మోసం, నేరపూరిత బెదిరింపులతో పాటు ఇతర విషయాలపై ఇందిరానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిమీద పిటిషనర్ బెయిల్ తీసుకున్నాడని.. ఆ తరువాత, దావణగెరెలో నివసిస్తున్నాడని తెలియడంతో, ఫిర్యాదుదారు అక్కడికి వెళ్లింది. అదే ఆరోపణలతో.. దాడి, అత్యాచారం ఫిర్యాదును అక్కడ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు.
రెండో ఫిర్యాదులో పిటిషనర్తోపాటు మరో మహిళ పేరు కూడా ఉంది. ఈ రెండు కేసుల్లో పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. పిటిషనర్, సహ నిందితురాలైన మహిళతో పాటు, విచారణను సవాలు చేశారు.