మనసేం బాలేదా..? ఇలా చేస్తే మీ మూడ్ మారుతుంది..

Published : Feb 01, 2022, 04:32 PM IST

కొన్ని కొన్ని సార్లు ఏ పని చేయాలనిపించదు.. ఎవ్వరితో మాట్లాడాలనిపించదు. కారణం మన మనస్సు బాగోలేకపోవడమే. ఏవేవో ఆలోచనలు, సంఘటన మూలంగానే మనసు అలా మారుతూ ఉంటుంది. మూడ్ ను కొన్ని సింపుల్ పద్దతుల ద్వారా రిపేర్ చేయొచ్చు తెలుసా..   

PREV
17
మనసేం బాలేదా..? ఇలా చేస్తే మీ మూడ్ మారుతుంది..

హ్యాపీగా సాగుతున్న జీవితంలో కొన్ని ఘటనలు ఎన్నటికీ చెరిగిపోవు. అలాంటి ఘటనలు యాదికి వచ్చినప్పడు మనసంతా అదోలా ఉంటుంది. జీవితంలో ఏదో కోల్పోయాను అనే ఆలోచనలోనే ముగిని తేలుతుంటారు. అలాంటి సమయంలో ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడాలనిపించకపోవడం, విసుగు, కోపం, నిరుత్సాహం వంటివి మనల్ని చుట్టుముడుతాయి. అంతేకాదు మనసంతా అనేక ఆలోచనలతో సతమతమవుతుంది. అలాంటి సమయంలో ఎవ్వరూ మాట్లాడినా.. వారిపై విసుగు చికాకు వస్తుంటాయి. అటువంటి సమయంలో కొన్ని పనులు చేస్తే మీ మూడ్ తొందరగా మారుతుంది. మరి అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27
childhood friends


మనస్సు బాధతో మూలుగుతున్నప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. మనసుకి నచ్చిన వాళ్లతో మాట్లాడితే కూడా మీ మూడ్ సెట్ అవుతుంది. అందుకే ఇష్టమైన వారితో కాసేపు ముచ్చటించండి. అలాగే మీ Childhood friends ను కలిసి మాట్లాడితే కూడా మీ మైండ్ రిపేర్ అవుతుంది. 

37

హ్యాపీ మూమెంట్స్ ఎంతో విలువైనవి తెలుసా.. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్సే మిమ్మల్ని నార్మల్ గా చేయడానికి మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. అందుకే మనసు బాగాలేనప్పుడు మీ తీపి మెమోరీస్ ను గుర్తుచేసుకోండి. దాని వల్ల మనస్సు ఉత్సాహం గా మారుతుంది. ఎటువంటి ఒత్తిడైనా ఇట్టే దూరమౌతుంది.
 

47

మనసును రిలాక్స్ చేయడంలో యోగాసనాలు కూడా బాగా ఉపయోగపడతాయి. బాధగా అనిపించినప్పుడు ఏదైనా ఆసనం వేస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అలాగే నచ్చే మ్యూజిక్ విన్నాకూడా బాధనుంచి ఈజీగా బయటకొస్తారు. అంతేకాదు.. అలసిపోయే విధంగా డ్యాన్స్ చేస్తే కూడా మనసు బాధ నుంచి బయటపడుతుంది. 
 

57

ఒత్తిడిగా ఫీలైనప్పుడు కాసేపు ఒంటరిగా ఉండండి. జంతువులు, పచ్చని చెట్టు, పక్షులు మధ్య గడిపితే కూడా మైండ్ ఉత్సాహంగా మారుతుంది. అలాగే గార్డెనింగ్ వంటి పనుల ద్వారా కూడా మనసు తేలిగ్గా మారుతుంది. 

67

ఒత్తిడిలో ఉన్నప్పుడు పిల్లలతో ఉండే తొందరగా బయటపడగలుగుతాం. మనసేం బాగాలేదు అనుకున్నప్పుడు చిన్నపిల్లల దగ్గర ఒక అరగంట సేపు సమయాన్ని గడిపినా.. చక్కటి ఫలితం ఉంటుంది. అయితే మనసంతా చికాకుగా ఉన్నప్పుడు సోషల్ మీడియా జోలికి అస్సలు పోకూడదు. దానివల్ల మీ చికాకు మరింత రెట్టింపయ్యే అవకావం ఉంది.
 

77

మనసును మార్చడంలో పుస్తకాలు ముందుంటాయి. అందుకే అలాంటి సమయాల్లో నచ్చిన పుస్తకాన్ని చదివితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేకాదు న్యూస్ పేపర్ చదివినా మీ మనసు తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. 
 

click me!

Recommended Stories