ఇక మధ్యాహ్న భోజనంలో సలాడ్ ను తీసుకోండి. క్యారెట్లు, దోసకాయలు, టమోటాలు వంటి వివిధ రకాల కూరగాయలతో సలాడ్లు తయారుచేసి తీసుకోవచ్చు. ప్రతి రోజూ మధ్యాహ్నం పూట అన్నాన్ని తినడం తగ్గించండి. ఎక్కువగా సలాడ్లు తీసుకోండి. లేదా ఉడకబెట్టిన కూరగాయలను తినండి. కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఇనుము వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.