ఇకపోతే అధిక రక్తపోటు పేషెంట్లు ప్రతిరోజు ఉదయం పూట 30 నిమిషాలు నడిచినా.. మందు బిల్లలు వేసుకోకుండానే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని అధ్యయనం కనుగొంది. ట్రెడ్ మిల్ నడక దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుందని అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో 55, 80 ఏండ్ల మధ్య వయసున్న 35 మంది ఆడవారు, 32 మంది మగవారు పాల్గొన్నారు.