తంజావూరులో బ్రహదేశ్వర ఆలయం, విజయనగర కోట, సరస్వతీ మహల్ గ్రంథాలయం, ఆర్ట్ గ్యాలరీ, సంగీత మహల్, మనోరా ఫోర్ట్, స్క్వార్జ్ చర్చి, మురుగన్ స్వామి ఆలయం వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ సందర్శనీయ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి పర్యాటకులు ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్రహదేశ్వర ఆలయం: తమిళ నిర్మాణ కళలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో బ్రహదేశ్వర ఆలయం ఒకటి. ఇది చోళుల కాలంలో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం ఇస్తూ కట్టబడిన ఆలయం. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావన కలిగి మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది.
విజయనగర కోట: బ్రహదేశ్వర ఆలయం ఈశాన్య ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో విజయనగర కోట ఉంది. ఈ కోట 16వ శతాబ్దానికి చెందినది. కోట లోపల అనేక శిల్ప కళలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. తంజావూరులో విజయనగర కోట ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ సందర్శన మీకు తప్పక నచ్చుతుంది.
సరస్వతీ మహల్ గ్రంథాలయం: తంజావూరులోని అతిపెద్ద పురాతన గ్రంథాలయంగా సరస్వతీ మహల్ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో మరాఠీ, తమిళ, తెలుగు, ఆంగ్ల భాషలలో అచ్చు కాబడిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. 1918 సంవత్సరంలో ఈ గ్రంథాలయం తమిళనాడు రాష్ట్ర నియంత్రణలో ఉంది.
సంగీత మహల్: తంజావూరులో ప్రధాన ఆకర్షణగా సంగీతం హాల్ ఉంది. సంగీత మహల్ లో మొదటి అంతస్తులో తంజావూరు ప్యాలెస్ ఉంది. ఈ మహల్ ను 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ మహల్ ను చోళ, నాయక్ పాలకుల కాలంలో వివిధ సంగీత కళాకారులు, నృత్య కారులు ప్రదర్శనల కోసం ఉపయోగించేవారు.
మనోరా ఫోర్ట్: మనోరా అనే పదం మీనార్ నుండి తీసుకోబడినది. ఈ ఫోర్ట్ తంజావూరుకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోర్ట్ ఎత్తు సుమారు 23 మీటర్లు, ఆరు కోణాల గల టవర్. ఈ ఫోర్ట్ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పార్కులు ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఫోర్ట్ 2004 హిందూ మహాసముద్ర సునామీ ఏర్పడినప్పుడు కోట దెబ్బతింది. తిరిగి ఈ కోటను మరమ్మత్తు చేశారు.