పురాణాల్లో ఈ ప్రాంతాన్ని మత్స్య దేశంగా పిలిచేవారు. ఈ ప్రదేశంలో పాండవులు తమ అరణ్యవాసంలో గడిపారని మహాభారతంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడి అందమైన సరస్సులు (Lakes), పెద్ద పెద్ద భవంతులు, స్మారక కట్టడాలు (Monuments), ఆలయాలు యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. దీనితో పాటుగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సరిస్కా అనే ప్రాంతాన్ని తప్పక చూడాలి.