Summer Heat : ఎండకాలం ఒంట్లో వేడి తగ్గాలంటే వీటిని తినండి..

Published : Mar 13, 2022, 09:50 AM IST

Summer Heat : ఎండాకాలం ఒంట్లో వేడి పెరగకుండా ఉండాలంటే మజ్జికగను ఖచ్చితంగా తాగాల్సిందే. రోజులో ఎక్కువ సార్లు మజ్జిగ, నీరు, కొన్ని రకాల పండ్లను తినడం వల్ల ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. 

PREV
19
Summer Heat : ఎండకాలం ఒంట్లో వేడి తగ్గాలంటే వీటిని తినండి..
summer

Summer Heat : వేసవికాలం మొదలు కావడంతోనే ఎండలు భగ్గుమంటున్నాయి. స్టార్టింగ్ యే ఇట్లుంటే ఇక రాను రాను ఎండలు ఏ తీరులో దంచి కొడతాయో చెప్పనక్కర్లేదు.. ఇక ఈ వేసవిలో మన ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు పోతూనే ఉంటుంది. దీంతో ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. 

29

అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా  వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, శరీర ఉష్ణోగ్రత పెరగకూడదన్నా.. వేసవిలో లభించే కొన్ని రకాల పండ్లను తినాలని చెబుతున్నారు నిపుణులు. 

39

వీటిని తినడం వల్ల మన బాడీలో తగినంత నీరు నిల్వ ఉంటుంది. అలాగే వీటిని తింటే హైడ్రేటెడ్ గా ఉంటారు కూడా. అంతేకాదు వీటిని తినడం వల్ల ఎండదెబ్బ కూడా తగలదు. మరి ఇందుకోసం ఎలాంటి పండ్లను తినాలో తెలుసుకుందాం పదండి..

49

పుచ్చకాయ: ఈ పండు ఎండాకాలంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండి నీటి శాతం ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6, లైకోపీన్, ఆమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

59

తాటి ముంజలు: ఎండాకాలంలో లభించే సీజనల్ పండ్లలో తాటి ముంజలు ఒకటి. ఈ కాలంలోనే ఇవి లభిస్తాయి. వీటిలో జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, సెలీనియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన ఒంట్లో నీరు తగ్గకుండా కాపాడుతాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. మలబద్దకం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 
 

69

కీరదోస: ఈ పండు ఇతర కాలాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఈ పండు అవసరం మాత్రం వేసవిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటాము. ఇది చర్మాన్నిరక్షిస్తుంది. స్కిన్ ను కాంతివంతంగా చేస్తుంది.  వీటిని తినడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. ఈ కీరలపై కాస్త ఉప్పు , నిమ్మరసం పిండుకుని తింటే ఇంకా రుచిగా ఉంటాయి. 

79

ద్రాక్ష: ద్రాక్షపండులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎండదెబ్బ తగలదు. అంతేకాదు వీటిని తినడం వల్ల ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. 

89

సపోటా: తక్షణ శక్తికి ఇవ్వడంలో సపోటా పండు ముందుంటుంది. ఈ పండ్లు తొందరగా అలసిపోయే వారికి బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గదు. అంతేకాదు ఈ పండ్లను తినడం వల్ల హుషారుగా కూడా ఉంటారు. 

99
butter milk

మజ్జిగ: ఎండాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన పానీయాలలో మజ్జిగ ఒకటి. ఈ కాలం శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రోజులో ఎక్కువ సార్లు మజ్జిగను తాగితే శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. బాడీ కూడా చల్లబడుతుంది. ఈ మజ్జిగను తాగితే దగ్గు, జలులు వంటి సమస్యలు రావు. ఇందులో కాస్త పుదీనాను వేసుకుని తాగినా.. అన్నంలో రైతాగా చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
 

click me!

Recommended Stories